మహర్దశ | - | Sakshi
Sakshi News home page

మహర్దశ

Jun 27 2025 6:35 AM | Updated on Jun 27 2025 6:35 AM

మహర్దశ

మహర్దశ

బొంరాస్‌పేట చెరువుకు

బొంరాస్‌పేట: మండల పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న బొంరాస్‌పేట చెరువు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో త్వరలో రూ.10 కోట్లతో ఎకో టూరిజం ఏర్పాటు కాబోతోంది. గురువారం జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్‌, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. చెరువులో బోటింగ్‌ ఏర్పాటు చేసి మరో ట్యాంక్‌ బండ్‌గా తీర్చిదద్దనున్నారు. చెరువుకు పక్కనే ఉన్న సంగమేశ్వర ఆలయ పరిసరాలు, అటవీశాఖ పరిధిలోని స్థలాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. పార్క్‌తోపాటు, చిన్నారుల కోసం ఆట వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. బొంరాస్‌పేట చెరువు జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

రెండు రోజుల్లో నివేదికలు

అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న టూరిజం పార్కుకు సంబంధించిన వివరాలను డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌ వివరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రయాణికులు సేదతీరడానికి బొంరాస్‌పేట చెరువు పరిసరాలు ఎంతో అనువుగా ఉంటాయన్నారు. గతంలో స్థల సమస్య కారణంగా పార్కులను అభివృద్ధి చేయలేకపోయామని, ప్రస్తుతం అడ్డంకులు తొలగిపోయినట్లు తెలిపారు. ఎకో టూరిజం పార్కు, చెరువులో బోటింగ్‌ కోసం అనుమతులు వచ్చాయన్నారు. ఇందు కోసం రూ.10 కోట్లు మంజూరు కానున్నట్లు వివరించారు. రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. డీఎఫ్‌ఓ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శేరి రాజేశ్‌రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ డీఈ కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలుగౌడ్‌, నాయకులు జయకృష్ణ, రాంచంద్రారెడ్డి, మల్లేశం, అంజిల్‌రెడ్డి, భీమయ్యగౌడ్‌, బాల్‌రాజ్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

రూ.10 కోట్లతో ఎకో టూరిజం ఏర్పాటు

క్షేత్రస్థాయి పరిశీలన చేసిన డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement