
గంజాయి విక్రేతకు రిమాండ్
తాండూరు: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన శుక్రవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేసు వివరాలను తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విలేకరులకు వెల్లడించారు. తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన లాల్ మహ్మద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు తాండూరు సీఐ సంతోశ్కుమార్కు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆయన తన సిబ్బంది ఎస్ఐ అంబర్యా, హెడ్ కానిస్టేబుల్ అమ్జద్, శివకుమార్, కానిస్టేబుల్స్తో కలిసి రైల్వే స్టేషన్ ఎదుట తనిఖీలు చేపట్టారు. ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపిండంతో అతన్ని అదుపులోకి తీసుకుని బ్యాగును తనిఖీ చేయగా 1.2 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఎవరైనా మత్తుపదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.