అప్పులు తీర్చేందుకు చోరీల బాట | - | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చేందుకు చోరీల బాట

Jun 28 2025 7:21 AM | Updated on Jun 28 2025 7:21 AM

అప్పులు తీర్చేందుకు చోరీల బాట

అప్పులు తీర్చేందుకు చోరీల బాట

సీసీ కెమెరాలకు చిక్కిన నిందితులు

అన్నదమ్ములకు రిమాండ్‌

యాచారం: ప్రైవేట్‌ ఉద్యోగస్తులైన ఇద్దరు అన్నదమ్ము లు అప్పులు తీర్చేందుకు చోరీల బాటపట్టారు. చివరకు సీసీ కెమె రాల ఆధారంగా పోలీసులకు చిక్కారు. ఈ మేరకు శుక్రవారం వారిని రిమాండ్‌కు తరలించారు. యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన నరేశ్‌, ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లికి చెందిన వెంకటేశ్‌ వరుసకు అన్నదమ్ములు. ఈ నెల 23న మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన బండ పార్వ తమ్మ నక్కర్తమేడిపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో తక్కళ్లపల్లి గేట్‌ వద్ద బస్సు ఎక్కేందుకు రోడ్డుపై వేచియుంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన అనదమ్ము లు హెల్మెట్లు ధరించి బైక్‌వచ్చి పార్వతమ్మ మెడలోంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెల్లారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసు లు శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. ఈ మేరకు వారి వద్ద నుంచి అపహరించిన పుస్తెలతాడును స్వాధీ నం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.

గోదాం పైనుంచి పడి కూలీ మృతి

హయత్‌నగర్‌: రేకుల షెడ్డు పైకప్పు నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిఽధిలో శుక్రవారం చో టుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ కొహెడకు చెందిన పొట్లచెరువు మల్లేశ్‌(55) తోటి కార్మికులతో కలిసి శుక్రవారం ఉదయం స్థానికంగా ఉన్న ఓ విత్తనాల కంపెనీ గోదాం పైకప్పు రేకులను మార్చే పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిన్నారిని చిదిమేసిన టిప్పర్‌ లారీ

తల్లి కళ్లెదుటే ఆరేళ్ల బాలుడి దుర్మరణం

దుండిగల్‌: రెప్పపాటు క్షణంలో ఆరేళ్ల బాలుడు ప్రాణాలు వదిలాడు. తన కళ్లెదుటే కుమారుడు విగత జీవిగా మారడంతో ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించడం స్థానికుల హృదయాలను కలచివేసింది. దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్‌ జిల్లా కేశవాపూర్‌ ప్రాంతానికి చెందిన రాజురెడ్డి, నిహారిక రెడ్డి దంపతులు కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి మల్లంపేటలోని ఆకాశ్‌ లేఅవుట్‌లో నివాసముంటున్నారు. రాజురెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా నిహారిక రెడ్డి గృహిణి. వీరికి అభిమన్షురెడ్డి (6), మరో చిన్నారి సంతానం. అభిమన్షు రెడ్డి బౌరంపేటలోని గీతాంజలి స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే నిహారిక శుక్రవారం ఉదయం 8 గంటలకు కుమారుడిని స్కూల్‌ వద్ద దింపేందుకు స్కూటీపై బయలుదేరింది. ఈ క్రమంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలోని పల్లవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎదురుగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిహారిక ఎడమ వైపు పడగా.. అభిమన్షు కుడి వైపు రోడ్డుపై పడడంతో టిప్పర్‌ లారీ వెనుక టైరు బాలుడి తలపై నుంచి వెళ్లింది. దీంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement