
సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
కుల్కచర్ల ఎస్ఐ రమేశ్
కుల్కచర్ల: దుకాణదారులు ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవానలి కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద కెమెరాలతో సమానమన్నారు. రోడ్డు ప్రమాదాలు, చోరీలు జరిగిన సమయంలో నిందుతులను సులువుగా పట్టుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
టీ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనదారుడికి తీవ్రగాయాలు
ఇబ్రహీంపట్నం రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. యాచారం మండలం గడ్డమల్లయ్యగూడకు చెందిన దార మహేందర్ బైక్పై వండల్ లా జంక్షన్ నుంచి కొంగరకలాన్వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే టీ జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ ఒక్కసారిగా కుడివైపునకు మలుపు తిప్పాడు. దీంతో వెనుకాల వస్తున్న బైక్ లారీ ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనదారుడు కిందపడిపోయి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీధి కుక్క స్వైర విహారం
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం వాచ్చతండా గ్రామపంచాయతీ దేవులనాయక్తండాలో శుక్రవారం వీధికుక్క స్థైర్య విహారం చేసింది. తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి, గాయపరిచింది. మేకలు, కోళ్ల వెంటపడుతున్న కుక్కను నేనావత్ చందర్, సబావత్ సక్రీబాయ్ అదిలించే ప్రయత్నం చేయగా వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిందని స్థానికులు తెలిపారు. పక్కనే ఉన్న ముడావత్ హర్షవర్ధన్(5)పై దాడిచేసి గాయపరిచిందని పేర్కొన్నారు. కుక్కల దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
హుండీ చోరీకి విఫలయత్నం ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు దర్గాలో హుండీ చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ్పరకారం.. చర్లపటేల్గూడకు వెళ్లే మార్గంలోని జహంగీర్పీర్దర్గా వద్ద హుండీని భూమిలోకి ఉంచి చుట్టూ సిమెంట్తో ఏర్పాటు చేశారు. ఈ హుండీని పెకిలిచేందుకు గుర్తు తెలియని దుండుగుల చుట్టూ ఉన్న సిమెంట్ తవ్వారు. ప్రయత్నం విఫలమవడంతో మధ్యలోనే వదిలి వెళ్లారు. దుండగుల ఆచూకీకి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి

సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి