ఇద్దరు మట్కారాయుళ్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు మట్కారాయుళ్ల అరెస్టు

Jun 28 2025 7:21 AM | Updated on Jun 28 2025 7:21 AM

ఇద్దరు మట్కారాయుళ్ల అరెస్టు

ఇద్దరు మట్కారాయుళ్ల అరెస్టు

తాండూరు: పట్టణంలోని ప్రధాన కూడలిలో మట్కానిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన శుక్రవారం తాండూరు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోశ్‌కుమార్‌ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌, ఇందిరమ్మ కాలనీకి చెందిన మహ్మద్‌ షఫీ మధ్యాహ్నం వినాయక చౌక్‌ కూడలి ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టగా రూ.4,210 నగదు మట్కా చిట్టీలు లభ్యమయ్యాయి. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement