జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక

Jun 27 2025 6:26 AM | Updated on Jun 27 2025 6:26 AM

జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక

జాతీయ స్థాయి శిక్షణకు ఎంపిక

పూడూరు: కంకల్‌ పాఠశాల ఉపాధ్యాయుడు ఈశ్వరరావు జాతీయ స్థాయి శిక్షణకు ఎంకయ్యారని మండల విద్యాధికారి సాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో సత్తాచాటారన్నారు. నూతన అభ్యసన ప్రక్రియలకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి ప్రదర్శనలు రాగా ఉత్తమ ప్రదర్శన అందించిన ఉపాధ్యాయులను జాయతీ స్థాయికి ఎంపిక చేశారన్నాని స్పష్టంచేశారు. వీరు జూలై 3నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే శిక్షణలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగాగురువారం కాంప్లెక్స్‌ హెచ్‌ఎం పుష్ప, లక్ష్మణ్‌, ఉపాధ్యాయులు ఈశ్వరరావును సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement