
పడిపోతున్న చిరు ధాన్యాల సాగు
● వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపుతున్న అన్నదాతలు ● డిమాండ్ ఉన్నా నామమాత్రంగానే సాగు ● ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
నవాబుపేట: చిరు ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో పోషక విలువలు మెండుగా ఉంటాయి. ఇలాంటి పంటల సాగు విస్తీర్ణం ఏటా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు వీటిని రైతులు సంప్రదాయ పంటలుగా సాగు చేసేవారు. ఇటీవల కాలంలో వాణిజ్య పంటల సాగుపై అన్నదాతలు మక్కువ చూపుతున్నారు. చిరుధాన్యాలైన పెసలు, ఉలవలు, సజ్జలు, కొర్రలు, పచ్చజొన్నలు, మినుములు, అనుములు వంటి పప్పుదినుసుల సాగు పెద్దగా కనిపించడం లేదు. నూనె గింజల సాగు సైతం భారీగా తగ్గింది. నువ్వులు, తెల్లకుసుమ, గడ్డి నువ్వులు వంటి సాగు తగ్గుముఖం పట్టింది. వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సంప్రదాయ పంటల స్థానాన్ని నేడు వాణిజ్య పంటలైన పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, కంది, గోధుమ వంటివి ఆక్రమిస్తున్నాయి. నల్లరేగడి నేలల్లో పండించే కొర్రలు, సజ్జలు, మినుములు, అనుములు, మంచి నువ్వులు పూర్తిగా తగ్గాయి. పదేళ్ల క్రితం వరకు మండలంలో చిరుధాన్యాల పంటల సాగు దాదాపు 5వేల ఎకరాల్లో ఉండేది.. ప్రస్తుతం వంద ఎకరాలకు పడిపోయింది.
ఏటా తగ్గుముఖం
గతేడాది మండలంలో పత్తి పంట 21,539 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 744 ఎకరాల్లో, కందులు 2,284 ఎకరాల్లో, కూరగాయల 2,177 ఎకరాల్లో, వరి 393 ఎకరాల్లో సాగు చేశారు. చిరుధాన్యాలైన పెసర కేవలం 18 ఎకరాల్లో, మినుములు 9 ఎకరాల్లో, ఉలవలు 3 ఎకరాలు, నూనె గింజలు(పొద్దుతిరుగుడు, తెల్ల కుసుమలు) 722 ఎకరాల్లో మాత్రమే సాగైంది. రాగులు, కొర్రలు, సజ్జలు, అవుశలు మచ్చుకై నా కనిపించలేదు. ఈ సారి సైతం చిరుధాన్యాల సాగు అంతంత మాత్రంగానే ఉండవచ్చని అధికారులు అంటున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
సంప్రదాయ పంటలైన చిరుధాన్యాలు, పలు రకాల నూనె గింజల సాగు రోజు రోజుకు కరుమరుగవుతోంది. వాటి సాగును ప్రోత్సహించేందు ప్రభుత్వా లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణ లు ఉన్నాయి. కూరగాయలు, పండ్ల తోటల సాగు కు రాయితీలు ఇచ్చే ప్రభుత్వాలు చిరు ధాన్యాల సాగును విస్మరించడం సరికాదని పలువురు అంటున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే చిరుధాన్యాల సాగు పెరిగే అవకాశం లేకపోలేదని పలువురు రైతులు పేర్కొన్నారు.
మంచి ధరలు
చిరుధాన్యాలకు మర్కెట్ మంచి ధరలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వారు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పెసర్ల ధర రూ.120 వరకు ఉంది. కిలో మినుములు రూ.100 పైనే, కిలో బెబ్బర్లు రూ.90, కిలో ఉలవలు రూ.100, పచ్చజొన్నలు రూ.40 వరకు పలుకుతున్నాయి.
ఆసక్తి చూపని రైతులు
చిరుధాన్యాల సాగుపై రైతు లు ఆసక్తి చూపడం లేదు. వాణిజ్య పంటల వైపే మొ గ్గుచూపుతు న్నారు. చిరు ధాన్యాల సాగుకు పెట్టుబ డి తక్కువ. దిగుబడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా శ్రద్ధ చూపడం లేదు.
– జ్యోతి, మండల వ్యవసాయాధికారి, నవాబుపేట

పడిపోతున్న చిరు ధాన్యాల సాగు