
వ్యసనాలకు దూరంగా ఉండాలి
తాండూరు రూరల్: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కరన్కోట్ ఎస్ఐ విఠల్ అన్నారు. తాండూరు మండలం జినుగుర్తి గేటు వద్ద ఉన్న మోడల్ స్కూల్లో గురువారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. వ్యసనాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. గంజాయి, డ్రగ్స్, మద్యపానం, పొగాకు వంటివి జీవితాలను నాశనం చేస్తున్నాయని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీదేవి, ఏఏస్ఐ పవన్కుమార్, కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.