
ఆంధ్రాలో స్టాక్..
మత్తు పదార్థాలను తమిళనాడు ప్రభుత్వం విక్రయించకుండా బ్యాన్ విధించింది. ఆ వ్యాపారంలో రాటుదేలిన అక్రమ వ్యాపారులు ఏకంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన వరదయ్యపాళెం మండలం బత్తలవల్లంలో మకాం పెట్టారు. దీంతో బత్తలవల్లం కేంద్రంగా మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏకంగా బత్తలవల్లంలోని ఓ ఆలయ సమీపంలో గోడౌన్లో పెద్దఎత్తున గుట్కా, హాన్స్, ఇతర మత్తు పదార్థాలను భారీగా నిల్వలు చేసి అటు తమిళనాడు, ఇటు ఆంధ్రాలో విక్రయించి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం చేపడుతున్నారు.
బత్తలవల్లంలోని ఓ గోదాంలో
నిల్వ చేసేందుకు లారీ నుంచి అన్లోడ్ చేస్తున్న మత్తు పదార్థాలు