
ఎస్వీయూ వీసీగా నర్సింగరావు
తిరుపతి సిటీ : ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ నర్సింగరావు బెనారస్ వర్సిటీలో పీజీ పూర్తి చేసి పలు ఐఐటీ కళాశాలల్లో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తించారు. మంత్రి లోకేష్ వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన ఎస్వీయూ వీసీగా నియమితులయ్యే అవకాశముందని రెండు నెలల ముందే సాక్షి పత్రిక పసిగట్టంది. ఈ మేరకు కథనాలు ప్రచురించడం గమనార్హం. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీని తమ ఆధీనంలో ఉంచుకోవడం కోసమే మంత్రి లోకేష్ తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తికి వైస్ చాన్సలర్ పదవిని కట్టబెట్టినట్లు జిల్లాలో విస్తృతంగా చర్చసాగుతోంది.