నాగాలమ్మ ఆలయం నేలమట్టం | - | Sakshi
Sakshi News home page

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

Jun 15 2025 7:12 AM | Updated on Jun 15 2025 7:12 AM

నాగాల

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

● కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ కరువు ● ప్రశ్నిస్తామన్న పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఎక్కడ ? ● బాబు కులదైవమైన నాగాలమ్మ ఆలయం కూల్చినా పట్టని ప్రభుత్వం ● నకిలీ పత్రాలతో రూ.40 కోట్ల విలువైన ఇనాం భూములు టీడీపీ నేత ఆక్రమణ ● దామినేడులో సగం గ్రామాన్ని కృష్ణమూర్తి నాయుడు పేరుపై అధికారుల ధారదత్తం ● ఆలయం కూల్చివేతపై మండి పడుతున్న హిందూ సంఘాలు

కూటమి ప్రభుత్వంలో ఆలయాలపై విధ్వంసం జరుగుతున్నా నోరు మెదపడంలేదు. రెండు రోజుల కిందట తిరుచానూరు సమీపంలో వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసం చేసి, విగ్రహాన్ని ముక్కలు చేసి మురుగు కాలువలో పడేశారు. నేడు దామినేడు వద్ద వందల ఏళ్ల నాటి నాగాలమ్మ ఆలయాన్ని నేలమట్టం చేసి ఆ గ్రామ ప్రజలకు ఇలవేల్పును లేకుండా చేశారు. ఇసుక తవ్వకాలకు అడ్డుగా ఉందని ఒక చోట..విలువైన భూములకు అడ్డుగా ఉందని ఇక్కడ ఆలయాలను కూల్చడంపై ప్రజలు మండిపడుతున్నారు.

ఆలయంలోకి అనుమతించలేదు

ఆలయంతో పాటు భూమిని ఆక్రమించుకున్న టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు అన్యాయంగా అర్థరాత్రి యంత్రాల సాయంతో ధ్వంసం చేశా డు. తరతరాలుగా ఇక్కడ ఉన్న మాకు లేని పట్టా లు ఎక్కడి నుంచో వచ్చిన కృష్ణమూర్తి నాయుడుకు ఎలా వస్తుంది. గతంలో ఇదే నేత కారణంగా ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. – పి. కుమారి, దామినేడు స్థానికురాలు

ఎమ్మెల్యే మౌనంగా ఎందుకున్నారు?

గత ప్రభుత్వంలో విగ్రహాలకు ఏదో జరిగిందంటూ రోడ్డెక్కిన టీడీపీ నేతలు ఇ ప్పుడేమయ్యారు. ఇది ము మ్మాటికి హిందువులపైన దాడే. చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నా, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నాని ఎందుకు పట్టించుకోవడం లేదు. ఆలయాలను కూల్చిస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోరు. వారాహి ఆలయ వివాదం విషయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

– చీనేపల్లి కిరణ్‌, హిందూ సంఘం ప్రతినిధి

తరతరాలుగా పూజిస్తున్నాం

నా వయస్సు 80 ఏళ్లు. నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ చెట్టు కింద నాగాలమ్మకు పూజలు చేస్తూనే ఉన్నాం. మా పూర్వీకుల నుంచి ఇలవేల్పుగా కొలుస్తున్నాం.ఆలయాన్ని ధ్వంసం చేయడం దారుణం.

– మీనాక్షమ్మ, స్థానికురాలు

టీడీపీ నేత దాష్టీకానికి నేలమట్టమైన నాగాలమ్మ ఆలయం (ఇన్‌సెట్‌) ఆలయం కూల్చకముందు పూజలు చేస్తున్న మహిళ

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌:కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేత లు వరుసగా హిందూ ఆలయాలను కూల్చివేయడం హిందూ సమాజంపైన దాడేనని ప్రజలు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద వందళ్ల ఏళ్ల నాటి నాగాలమ్మ ఆలయాన్ని టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు, అతని కుమారుడు దివాకర్‌ నేలమట్టం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణానికి ఒడిగడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై మండి పడుతున్నారు. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు హిందూ సంఘాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

భూములు కాజేసేందుకు కుట్ర

కూటమి నేతలు పథకం ప్రకారం భూములను కాజేసేందుకు ఆలయాలను నేలమట్టం చేస్తున్నారని ఆరోపణలు గుప్పమంటున్నాయి. కోట్ల రూపాయల విలువైన ఇనాం భూములను 2014–19 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కృష్ణమూర్తి నాయుడు తప్పుడు పత్రాలతో రికార్డులను సృష్టించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో గతంలో గ్రామంలోని ప్రజలు అడ్డుకుని నిరసనకు దిగడంతో అప్పట్లో మిన్నుకుండిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం, సుమారు రూ.40 కోట్ల విలువైన భూములు జాతీయ రహదారికి అనుకుని ఉండటంతో అరాచకానికి పాల్పడుతున్నారు. ఇంత దారుణమైన ఘటనలు ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏ శుభకార్యమైనా ఇక్కడ నుంచే ప్రారంభిస్తాం

మా గ్రామంలోని ఏ ఇంట్లో అయినా శుభకార్యానికి ముందు నాగాలమ్మకు పూజలు చేసే ప్రారంభిస్తాం. అలాంటి మా కులదైవాన్ని మాకు కాకుండా టీడీపీ నేత కృష్ణమూర్తి నాయుడు అడ్డుకున్నాడు. దొంగ పత్రాలను సృష్టించి భూములను కాజేయడంతో పాటు మాపైనే దౌర్జనాన్యికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఏకంగా మా ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నిస్తున్నాడు. – ఐ. కుమారి, స్థానికురాలు

భూములను కాజేసేందుకే..

జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఇనాం భూములు విలువ కోట్ల రూపాయలు పలుకుతోంది. ఈ భూమిని కాజేసేందుకు టీడీపీ నాయకుడు కృష్ణమూర్తి నాయుడు ఇంతటి దురాగతానికి పాల్పడుతున్నాడు. తాత ముత్తాల కాలం నుంచి మేము ఇక్కడే జీవిస్తున్నాం. ఇక్కడ భూమిని విక్రయించేందుకు నాగాలమ్మ ఆలయం అడ్డుగా ఉందనే, ఆలయాన్ని నేలమట్టం చేశాడు. – నాగలక్ష్మి, స్థానికురాలు

మా ఇంటి ఇలవేల్పును కూల్చేశారు

గ్రామంలోని ఎంతో మంది నాగాలమ్మ దేవత ఇలవేల్పుగా పూజలందుకుంటోంది. ఇప్పటికే మా భూములను అక్రమంగా లాక్కొవడంతో పాటు సగం గ్రామాన్ని అధికారులు అతనిపై రికార్డులు సృష్టించి ఇచ్చారు. ఇప్పుడు మా ఇలవేల్పును ధ్వంసం చేసేశాడు. ఈ కూటమి అండతో మమల్ని కూడా చంపేస్తాడేమోనని భయం వేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే నాని గానీ, టీడీపీ నాయకులు గాని ఇటువైపు తిరిగి చూడలేదు. – మల్లీశ్వరి, స్థానికురాలు

నాగాలమ్మ ఆలయం నేలమట్టం 
1
1/8

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

నాగాలమ్మ ఆలయం నేలమట్టం 
2
2/8

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

నాగాలమ్మ ఆలయం నేలమట్టం 
3
3/8

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

నాగాలమ్మ ఆలయం నేలమట్టం 
4
4/8

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

నాగాలమ్మ ఆలయం నేలమట్టం 
5
5/8

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

నాగాలమ్మ ఆలయం నేలమట్టం 
6
6/8

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

నాగాలమ్మ ఆలయం నేలమట్టం 
7
7/8

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

నాగాలమ్మ ఆలయం నేలమట్టం 
8
8/8

నాగాలమ్మ ఆలయం నేలమట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement