
ప్రయాణికులకు ‘మహా’ కష్టాలు
● బస్సులు లేక ప్రజల ఇక్కట్లు ● మహానాడుకు వెళ్లిన 365 సర్వీసులు
తిరుపతి అర్బన్ : ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వం పార్టీ సేవలకు వాడేస్తోంది. కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు జిల్లా నుంచి 365 బస్సులను తరలించేసింది. దీంతో ప్రయాణికులు బస్సుల కోసం ఆర్టీసీ బస్టాండ్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది.
11 డిపోల నుంచి తరలింపు
జిల్లాలో మొత్తం 11 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. దాదాపు అన్ని డిపోల నుంచి మహానాడుకు సర్వీసులు కేటాయించారు. అయితే ఒక్క వెంకటగిరి నుంచే 50 బస్సులను పంపించడం వివాదాస్పదంగా మారింది. ఈ డిపోలో ఉండేది వంద బస్సులైతే అందులో సగం తరలించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. టీడీపీ సమావేశానికి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
పడిగాపులు
జిల్లాలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. పార్టీ మీటింగ్ల పేరుతో సామాన్య ప్రజలను అవస్థలకు గురిచేయడంపై ఆర్టీసీ ఉద్యోగులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంచి పద్ధతి కాదు
ఇటీవల అమరావతికి ప్రధానమంత్రి వస్తున్నారని ఆర్టీసీ బస్సులను భారీ సంఖ్యలో పంపించారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ మహానాడు అంటూ వందలాది బస్సులను పంపేశారు. ఇక్కడ ప్రయాణికులు బస్టాండ్లలో అవస్థలు పడుతున్నారు. పార్టీ మీటింగ్లకు ప్రైవేట్ బస్సులు తీసుకుకోవాలి. అంతే కానీ, ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. – శేఖర్, తిరుపతి

ప్రయాణికులకు ‘మహా’ కష్టాలు