డ్రగ్స్‌ నిర్మూలనపై విస్తృత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నిర్మూలనపై విస్తృత ప్రచారం

May 31 2025 12:35 AM | Updated on May 31 2025 12:35 AM

డ్రగ్స్‌ నిర్మూలనపై విస్తృత ప్రచారం

డ్రగ్స్‌ నిర్మూలనపై విస్తృత ప్రచారం

తిరుపతి అర్బన్‌: అవగాహనతోనే డ్రగ్స్‌ను నిర్మూలించొచ్చని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం డ్రగ్స్‌ నిర్మూలపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ఫలితాలను యువతకు వివరించాలని సూచించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈగల్‌ క్లబ్‌లు, డ్రాప్‌ బాక్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. వారం రోజుల్లోగా డీ అడిక్షన్‌ సెంటర్‌ను పూర్తి స్థాయిలో వసతులు కల్పించి, వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్‌ ఫ్రీ నంబర్‌పై సరైన ప్రచారం కల్పించాలన్నారు. అనంతరం మాదక ద్రావ్యాల నిషేధంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్డీవోలు రామమోహన్‌, భానుప్రకాష్‌రెడ్డి, కిరణ్మయి, డీఈవో కేవీఎన్‌ కుమార్‌, డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్‌, ఆర్టీవో మురళీమోహన్‌, ఆర్టీసీ ఏటీఎం డీఆర్‌ నాయుడు, ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ వాసుదేవచౌదరి, రుయా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాధా, డ్రగ్స్‌ అధికారులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement