
విజన్ డాక్యుమెంట్స్ సిద్ధం చేయండి
తిరుపతి అర్బన్ : విజన్ డాక్యుమెంట్స్ 2047కు సంబంధించి ఏ పనులు చేపట్టాలనే అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో టెలికాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్, జేసీ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డీఆర్వో నరసింహాలతోపాటు నియోజకవర్గ ఇన్చార్జి అధికారులతో సమీక్షించారు. ఈనెల 9న సీఎం చంద్రబాబు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్పై వర్చువల్గా జిల్లా అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. అలాగే ఏడాది కాలంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వాటిని, శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్న వాటిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలాగే ఈనెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాలపై అవగాహన పెంచాలని సూచించారు. ఆదివారం డివిజన్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించే సీనియర్ సిటిజనన్ యోగా కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ఈనెల 9న సోమవారం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాలు, డివిజన్, జిల్లా ప్రధాన కేంద్రంలో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్ఐఓలు యోగా పై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని చెప్పారు.