కక్ష సాధింపుతోనే కేసులు | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపుతోనే కేసులు

Jun 8 2025 1:00 AM | Updated on Jun 8 2025 1:00 AM

కక్ష

కక్ష సాధింపుతోనే కేసులు

చిల్లకూరు : కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్సీ , గూడూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేరుగ మురళీధర్‌ పేర్కొన్నారు. ఇటీవల గూడూరు మండలం పోటుపాళెం పంచాయతీకి చెందిన పురుటిపాళెంకు చెందిన దయాకర్‌తో పాటు మరో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారని, వారు బెయిల్‌పై శనివారం విడుదల కావడంతో వారిని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అన్యాయంగా కేసులు నమోదు చేసి భయాందోళనలకు గురి చేస్తున్నారని దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తగిన సమయంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హితవు పలికారు. అక్రమ కేసుల్లో ఉన్న ప్రతి కార్యకర్త, నాయకుడికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువత కార్యదర్శి కొండూరు సునీల్‌రెడ్డి, గూడూరు ఎంపీపీ బూదూరు గురవయ్య, నాయకులు అశోక్‌, తదితరలు ఉన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

చంద్రగిరి : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ శనివారం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త నల్లాని రాజేశ్వరి, మహిళా కమిషన్‌ చైర్మన్‌ను కలిసి సత్కరించి, సాధికారత పుస్తకాన్ని అందజేశారు. అనంతరం ప్రతి మహిళా సాధికారత దిశగా ముందుగా సాగేలా చేయూతనందించాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నాయుడుపేటటౌన్‌ : బైక్‌పై వెళుతున్న వ్యక్తి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మైలురాయిని ఢీకొని పూడేరు మణి(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నరసారెడ్డి కండ్రిగ–కృష్ణామనాయుడు కండ్రిగ గ్రామాల మధ్య రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. చిట్టమూరు మండలం గునపాడు గ్రామానికి చెందిన మణి నాయుడుపేటలో పనులు చూసుకుని సాయంత్రం బైక్‌పై గ్రామానికి వెళుతుండగా మార్గ మధ్యలో నరసారెడ్డి కండ్రిగ దాటిన తరువాత బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మైలు రాయిను ఢీకొంది. ఈ ప్రమాదంలో మణి తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ ఆదిలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

కక్ష సాధింపుతోనే కేసులు 1
1/2

కక్ష సాధింపుతోనే కేసులు

కక్ష సాధింపుతోనే కేసులు 2
2/2

కక్ష సాధింపుతోనే కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement