ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌

Jun 8 2025 1:02 AM | Updated on Jun 8 2025 1:02 AM

ఇంటర్

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌

సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడి

తిరుపతి ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలను ఇంటర్‌ బోర్డు శనివారం ప్రకటించింది. గత నెల 12 నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షకు ప్రథమ సంవత్సర జనరల్‌ విద్యార్థులు 7,985మంది హాజరవ్వగా వారిలో 4,068(51శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర జనరల్‌ విద్యార్థులు 4,708మందికి 3,360(71శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 301 మందికి 160(53శాతం) మంది, ద్వితీయ సంవత్సరంలో 244మందికి 188(75శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్‌, ఒకేషనల్‌లో కలిపి 13,238 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా వారిలో 7,770(59శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో తిరుపతి జిల్లా 4వ స్థానం సాధించినట్లు ఆర్‌ఐఓ జి.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

తిరుపతి నుంచి మూడు రాష్ట్రాలకు ఆర్టీసీ సర్వీసులు

తిరుపతి అర్బన్‌: తిరుపతి నగరం నుంచి దేశంలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేయడానికి గతంలోనే ప్రణాళికలు తయారు చేశారు. వాటిని అమలు చేయాల్సి ఉందని తిరుపతి డీఎం బాలాజీ తెలిపారు. ఆయన శనివారం తమ చాంబర్‌ నుంచి మాట్లాడుతూ ప్రస్తుతం తిరుపతి నుంచి తమిళనాడుకు ప్రతి రోజు 131 నడుస్తున్నాయి, అలాగే తమిళనాడు ఆర్టీసీ నుంచి తిరుపతికి రోజు 136 సర్వీసులు వచ్చిపోతున్నాయి వెల్లడించారు. తిరుపతి నుంచి కర్నాటకకు 41 సర్వీసులు నడుస్తున్నాయని, కర్నాటక నుంచి తిరుపతికి 33 సర్వీసులు వచ్చిపోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణాకు తిరుపతి నుంచి 62 సర్వీసులున్నాయని, తెలంగాణ నుంచి తిరుపతికి 61 సర్వీసులు ఉన్నట్లు చెప్పారు. వీటితోపాటు కేంద్రపాలిత ప్రాంతం అయిన పాండిచ్చేరికి నిత్యం ఉదయం, సాయంత్రం బస్‌ సర్వీసులు నడుపుతున్నట్లు వివరించారు. అయితే తాజాగా ఒడిస్సా రాష్టం వారు ఈ నెల 11 నుంచి పూరి – తిరుపతికి రెండు సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో పూరి నుంచి తిరుపతికి ట్రయల్‌ రన్‌గా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు.

అత్యాధునికంగా

అలిపిరి టోల్‌ ప్లాజా

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్‌ ప్లాజా సెంటర్‌ను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామల రావు ఆదేశించారు. శనివారం ఈఓ తన ఛాంబర్‌లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల వాహనాలు, లగేజీని తక్కువ సమయంలో స్కాన్‌ చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్‌ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం, విజిలెన్స్‌ కసరత్తు చేయాలన్నారు.

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ 
1
1/1

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement