
వైఎస్సార్ రైతు భరోసా
అన్నదాతకు అండగా..
● 8,73,146 మంది రైతులకు రూ.663.07 కోట్లు పెట్టుబడి సాయం ● ఏటా రూ.13,500 సేద్యం కోసం రైతుకి సాయం ● రెండు సీజన్ల్లో తెలుగు గంగనీరు..రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం
తిరుపతి అర్బన్ : రబీ, ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు పంట పెట్టుబడులు, సేద్యం ఖర్చులకు గత వైఎస్సార్సీపీ సర్కార్ ఐదేళ్ల పాటు (2019–24)వరుసగా క్రమం తప్పకుండా జిల్లాలో 8,73,146 మంది రైతులకు రూ.663.07 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించారు. దీంతో రైతులు అప్పులు చేయకుండా సర్కారు ఇచ్చిన రైతు భరోసాతోనే వ్యవసాయం పండుగలా చేశారు. గత ఐదేళ్ల పాలన స్వర్ణయుగమేనంటూ అన్నదాతలు చర్చించుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నకిలీ విత్తనాలకు స్వస్తి చెప్పి...నాణ్యమైన విత్తనాలు రాయితీలతో ఇవ్వడం, యూరియా కృత్రిమ కొరత లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఉచిత పంట బీమా కల్పించింది. దెబ్బతిన్న పంటలకు ఇన్ఫుట్ సబ్సిడీలను అందించి రైతులను ఆదుకుంది. పెట్టుబడి సాయంగా రైతులకు ఏటా రూ.13500 క్రమం తప్పకుండా ఇవ్వడం, కౌలు రైతులకు బ్యాంక్ రుణాలు ఇప్పించి గత జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. తెలుగుగంగ 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రబీతోపాటు ఖరీఫ్లోనూ సాగునీరు ఇవ్వడంతో జిల్లాలో ఏటా 70 వేల నుంచి 80 వేల ఎకరాల బీడు భూములు సైతం సాగులోకి తీసుకొచ్చిన రైతు బాంధవుడిగా ఒకే ఒక్కడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులు మదిలో నిలిచిపోయారు.
ఒకే ఒక్కడు
వైఎస్సార్ రైతు భరోసా నిధుల (2019–24) వివరాలు
సంవత్సరం రైతుల సంఖ్య లబ్ధి పొందిన
మొత్తం(రూ.కోట్లలో)
2019–20 1,55,207 119.97
2020–21 1,79,030 134.81
2021–22 1,81,711 136.55
2022–23 1,76,435 134.73
2023–24 180,763 137.01

వైఎస్సార్ రైతు భరోసా