పడకేసిన ప్రతిపాదన! | Vanasthalipuram Bus Terminal | Sakshi
Sakshi News home page

పడకేసిన ప్రతిపాదన!

Jun 10 2025 9:47 AM | Updated on Jun 10 2025 9:46 AM

Vanasthalipuram Bus Terminal

వనస్థలిపురం బస్‌ టెర్మినల్‌ ఏమైనట్టో!!

మూడేళ్ల క్రితమే హెచ్‌ఎండీఏ స్రణాళికలు  

కొత్త ప్రభుత్వంలో అటకెక్కిన ప్రాజెక్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: శాటిలైట్‌ బస్‌టెరి్మనళ్ల  ప్రతిపాదన అటకెక్కింది. నగరంలో రోజు రోజుకూ తీవ్రమవుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని శివార్లలో శాటిలైట్‌ బస్‌ టెర్మినళ్లకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హెచ్‌ఎండీఏ ప్రణాళికలను రూపొందించింది. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులన్నీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరుతున్నాయి. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా గంటల తరబడి  సిటీరోడ్లపైనే నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. సంక్రాంతి, దసరా వంటి పర్వదినాలు, వరుస సెలవులు, వేసవి సెలవుల్లో  రెగ్యులర్‌ బస్సులతో పాటు ప్రత్యేక బస్సుల రద్దీ కూడా పెరుగుతోంది. 

దీంతో బస్సుల నిర్వహణలో మరింత జాప్యం నెలకొంటోంది. ఈ  ఇబ్బందులను  అధిగమించేందుకు శివారు ప్రాంతాల్లో స్థలం అందుబాటులో ఉన్నచోట శాటిలైట్‌ టెర్మినళ్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి  సిటీసర్వీసులను నడపాలనేది  ప్రతిపాదన. ఈ మేరకు మియాపూర్‌తో పాటు వనస్థలిపురంలో రెండు టెర్మినళ్లను  ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మియాపూర్‌లోని స్థలాన్ని ట్రక్‌ పార్కింగ్‌ కోసం వినియోగిస్తున్నారు. వనస్థలిపురంలో ఏర్పాటు చేయడం ద్వారా  విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే బస్సులను వనస్థలిపురం వరకు పరిమితం చేయాలని భావించారు. కానీ ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లిపోయింది.  

అటవీశాఖ సానుకూలత.. 
వనస్థలిపురంలోని హరిణ వనస్థలి పార్కు వద్ద  టెర్మినల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఇచ్చేందుకు అప్పట్లో అటవీశాఖ నుంచి సానుకూలత వ్యక్తమైంది. 680 మీటర్ల విస్తీర్ణంలో  టెరి్మనల్‌ నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు సైతం ఈ ప్రాంతంలో  క్షేత్రస్థాయిలో పర్యటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా అధునాతన సదుపాయాలతో ప్రతిరోజూ కనీసం 1000 బస్సులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుందని అప్పట్లో అధికారులు  తెలిపారు.  

మరోవైపు దీన్ని పర్యావరణహిత ప్రమాణాలతో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సోలార్‌ విద్యుత్‌ను వినియోగించాలని భావించారు. వనస్థలిపురం టెర్మినల్‌  సాకారమైతే విజయవాడ, గుంటూరు, ఖమ్మం, సూర్యాపేట్, భద్రాచలం, నల్లగొండ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే  బస్సులన్నింటినీ అక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, ఎల్‌బీనగర్, హయత్‌నగర్‌ వరకు అన్నిచోట్లా ఆరీ్టసీ, ప్రైవేట్‌ బస్సులను నిలపడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. శాటిలైట్‌ టెరి్మనల్‌ అందుబాటులోకి వస్తే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement