హైదరాబాద్ ‘మెట్రో రైల్’ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన | Union government makes key announcement on Hyderabad Metro Rail | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ‘మెట్రో రైల్’ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Apr 2 2026 7:52 PM | Updated on Apr 2 2026 8:10 PM

Union government makes key announcement on Hyderabad Metro Rail

ఢిల్లీ:  హైదరాబాద్‌ నగర మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 2 ఆమోదానికి కాలపరిమితి లేదని, ప్రాజెక్టు ఆమోదం అనేది మదింపు ప్రక్రియ ఫలితం,  సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యత పై ఆధారపడి ఉంటుందని తెలిపింది.  ఈ మేరకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక  సమాధానం ఇచ్చారు. 

‘2017 మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పై అప్రైజల్ జరుగుతుంది. మెట్రో రైల్ ప్రాజెక్టులు అత్యధిక వ్యయంతో కూడుకున్నవి. ప్రతిపాదిత ఫేస్ 2 నెట్వర్క్ ను ప్రస్తుత ఫేజ్ 1 మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే సాంకేతిక సాధ్యసాధ్యల పై సలహా ఇవ్వడానికి కమిటీని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు  ఆప్షన్లను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలియజేయాలి’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement