టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. విచారణను సీసీఎస్ సిట్కు బదిలీ
Published
Tue, Mar 14 2023 6:42 PM
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు పురోగతి చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను మంగళవారం సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ స్టేషన్)కు బదిలీ చేశారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. సీసీఎస్ తరపున సిట్ ఇకపై ఈ కేసు దర్యాప్తును కొనసాగించనుంది. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
మరోవైపు నిందితులను కస్టడీకి కోరుతూ కోర్టులో బేగంబజార్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈలోపే సంచలనం సృష్టించిన ఈ కేసు సీసీఎస్ సిట్కు బదిలీ అయ్యింది.