Telangana: కొత్తగా 102 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం 25,449 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 102 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.89 లక్షలకు చేరుకుంది. తాజాగా కరోనా నుంచి 287 మంది కోలుకోగా, మొత్తం 7.84 లక్షల మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు వైరస్తో 4,111 మంది బలయ్యారు. ఇక ప్రస్తుతం 1,525 క్రియాశీలక కరోనా కేసులున్నాయి.