Telangana Governor Tamilisai Says Manneguda Kidnapping Has Shocked - Sakshi
Sakshi News home page

మన్నెగూడ కిడ్నాప్‌ ఘటన షాక్‌కు గురిచేసింది: గవర్నర్‌ తమిళిసై

Dec 10 2022 10:21 AM | Updated on Dec 10 2022 12:56 PM

Telangana Governor Tamilisai Says Manneguda Kidnapping Has Shocked - Sakshi

మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ ఘటన తనను షాక్‌కు గురి చేసిందన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్‌ ఘటన తనను షాక్‌కు గురి చేసిందన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌. యువతి భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. యువతి కుటుంబానికి భద్రత కల్పించాలని తెలంగాణ డీజీపీని కోరారు తమిళిసై. 

యువతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
అపహరణకు గురైన వైద్య విద్యార్థిని వైశాలి కుటుంబ సభ్యులను మన్నెగూడకు వెళ్లి పరామర్శించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి. ఈ సందర్భంగా.. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

ఇదీ చదవండి: మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement