
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గాందీభవన్లో ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నా యకులు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే లు, పార్టీ నేతలు పాల్గొంటారని వెల్లడించారు.
దశాబ్ది ఉత్సవాల శకటం ప్రారంభం
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల శకటాన్ని శనివారం గాందీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, మెట్టుసాయి పాల్గొన్నారు.