సంక్రాంతి రైళ్ల జాడేది? 

South Central Railway Does Not Allocate Special Trains For Sankranti - Sakshi

ప్రత్యేక రైళ్ల ఊసెత్తని దక్షిణ మధ్య రైల్వే

అన్ని రైళ్లలో వందల్లో వెయిటింగ్‌

ఫిబ్రవరి వరకు బెర్తు కష్టమే   సొంతూరు వెళ్లాలంటే కష్టమే

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతికి సొం­­త ఊరెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం­చేసుకుంటున్ననగర ప్రజలను రైళ్లలో బెర్తుల కొరత నిరాశకు గురి చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి తెలు­గు రాష్ట్రాలకు, ఇతర ఇరుగు పొరు­గు ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రైళ్లలో వెయిటింగ్‌ లి­స్టు వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో ఇక ఏ మాత్రం బుకింగ్‌కు అవకాశం లేకుం­డా ‘నో రూమ్‌’దర్శనమిస్తోంది. 

సాధారణంగా సంక్రాంతి రద్దీని దృష్టి­లో ఉంచుకొని నవంబర్‌ నెల­లోనే ప్రత్యేక రైళ్లనుప్రకటించవలసి­న దక్షిణమధ్య రైల్వే అధికారులు.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణి­కుల్లో ఆందోళన నెలకొంది. ‘ఈ నెలలో కూడా ప్రత్యేక రైళ్లను ప్రక­టిం­చే అవకాశంలేదు. ప్రయాణికు ల డిమాండ్, రద్దీమేరకు ఏ రూట్‌­లో ఎన్ని రైళ్లు అవసరమనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ కూడా లేదు’..అని దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు స్పష్టంచేశారు. దీం­తో రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్‌లకు అవకా­శంలేక ప్రత్యేక రైళ్ల కోసం ఎదురు చూ­స్తున్న ప్రయాణికులు చివరి నిమిషం వర­కు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 

భారీగా పెరగనున్న రద్దీ.. 
సాధారణంగా ఏటా సంక్రాంతికి హైదరాబాద్‌ నుంచి సుమారు 25 లక్షల మందికి పైగా సొంత ఊళ్లకు తరలి వెళ్తారు. ఈసారి ప్రయాణికుల రద్దీ మరింత పెరి­గే అవకాశం ఉన్నట్లు అంచనా. డిసెంబర్‌ మొదటి వారం వరకే అన్ని రైళ్లలో స్లీపర్, ఏసీ బెర్తులు రిజర్వ్‌ అయిపోవడం, ఫిబ్రవరి మొదటి వారం వరకు బెర్తులు అందుబాటులో లేకపోవడం వంటి పరిణామాల దృష్ట్యా ఈ ఏడాది డిమాండ్‌ పెరగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఏటా నవంబర్‌లో ఒకసారి, డిసెంబర్‌ చివర్లో మరోసారి 100కు పైగా రైళ్లను అదనంగా నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తారు. 

ఈ­సారి అలాంటివేవీ లేకపోవడంతో చివరి నిమిషంలో అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటించినా పెద్దగా ఉపయోగం ఉండబోదని కూకట్‌పల్లి హౌసింగ్‌బో­ర్డు­కు చెందిన ప్రయాణికుడు శివరాజ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బయల్దేరే గోదావరి, విశాఖ, కోణా­ర్క్, గౌతమి, నర్సాపూర్, పద్మావతి, నారాయణాద్రి తదితర అన్ని రైళ్ల­లోనూ 150 నుంచి 300 వరకు వెయిటింగ్‌ లిస్టు కనిపించడం గమనార్హం. హైదరాబాద్‌ నుంచి విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతి, బెంగళూ­రు తదితర నగరాలకు ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉంది.  

ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు.. సంక్రాంతి సందర్భంగా 4,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలకు ప్రయాణికులరద్దీ మేరకు ఈ బస్సులను నడుపనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top