మరోసారి విజృంభిస్తున్న కరోనా!

Rising Covid Cases In Maharashtra, Punjab Matter Of Grave Concern: Centre - Sakshi

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 62,714 కేసులు, 312 మంది మృతి

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌!

ఆర్థికరంగంపై భారం పడకుండా ప్రణాళిక

బెంగళూరులో పదేళ్లలోపు పిల్లలకూ కరోనా

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా అధికమవుతోంది. గత 24 గంటల్లో 62,714 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కు... 312 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,552కు చేరుకుంది. ఈ ఏడాది ఒక రోజు మరణాల్లో ఇదే అత్యధికం. అత్యధిక కేసులు మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్‌ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.  

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ ప్రభావం ఆర్థిక రంగంపై పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించింది. ఇక బెంగళూర్‌లో చిన్నారులకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. పదేళ్లలోపు వయసున్న పిల్లలు ఈ నెలలో 470 మందికిపైగా కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top