సీపీఎస్‌ ఉద్యోగుల తొలి డైరీ ఆవిష్కరణ 

Minister Harish Rao Unveiled First Diary Of CPS Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) పరిధిలో పనిచేస్తోన్న ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) రూపొందించిన తొలి డైరీని శనివారం మినిస్టర్‌ క్వార్టర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి  హరీశ్‌రావు ఆవిష్కరించారు.

అనంతరం నేషనల్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం సెక్రటరీ జనరల్‌ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ... సీపీఎస్‌ ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని ఈ డైరీలో పొందుపరిచామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌సీపీఎస్‌ఈ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top