
కసరత్తు పూర్తిచేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
తొలుత హెచ్ఎండీఏ పరిధిలోని భూములకు వర్తింపు
కనీసం 20% నుంచి 100% వరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు పెంపు
సీఎం నిర్ణయమే తరువాయి..
విలువలు పెంచినా స్టాంపు డ్యూటీ తగ్గించే యోచనలో ప్రభుత్వం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విలువలు త్వరలోనే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తును పూర్తి చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన నివేదికను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరిశీలించి.. సీఎం రేవంత్రెడ్డికి అందజేశారని, దానికి సీఎం ఆమోదం తెలిపిన వెంటనే పెరిగిన భూముల విలువలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.
అయితే, ముందుగా హెచ్ఎండీఏ పరిధిలోని భూముల కు మాత్రమే ఈ విలువల సవరణ వర్తింపజేస్తా రని, కొన్ని రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పెంచుతారని తెలుస్తోంది. కాగా, భూముల రిజి స్ట్రేషన్ విలువలు భారీగా పెరిగినా, ప్రజలపై ఎక్కువ భారం పడకుండా అర శాతం మేర స్టాంపు డ్యూటీ తగ్గించే అవకాశాలున్నాయని సమాచారం.
ఏడాది క్రితమే..
వాస్తవానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూన్ లో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కార్య క్రమాన్ని చేపట్టింది. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి వర్తించే విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి.. సబ్రిజిస్ట్రార్ల ద్వారా సవరణ ప్రతిపాదనలను తెప్పించారు. 2024, జూన్ 29 నాటికి సవరించిన విలువలను ప్రభుత్వానికి పంపి ఆమోదం అనంతరం ప్రజాభిప్రాయం సేకరించి 2024, ఆగస్టు1 నుంచి సవరించిన రిజిస్ట్రేషన్ విలువలను అందుబాటులోకి తేవాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సబ్రిజిస్ట్రార్ల స్థాయిలో కసరత్తు జరిగిన అనంతరం ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది.
రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో భూముల విలువలు పెంచితే మరింత వ్యతిరేక ప్రభావం చూపుతుందని, తద్వారా మార్కెట్ నష్టపోతుందనే ఆలోచనతో అప్పట్లో ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది. ఆ తర్వాత థర్డ్ పార్టీ చేత విలువల సవరణ ప్రక్రియను చేపట్టింది. థర్డ్ పార్టీ కూడా నివేదిక ఇచ్చింది. అయినా, ఎప్పటికప్పుడు భూముల విలువల సవరణ అంశం వాయిదా పడుతూనే వచ్చింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మళ్లీ కసరత్తు ప్రారంభించింది.
గత నెలలో మళ్లీ షెడ్యూల్..
భూముల విలువల సవరణ కోసం ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. విలువలను సవరించేందుకు వీలుగా మళ్లీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తూ, జీవో నం. 41ని విడుదల చేసింది. సవరణ ప్రతిపాదనలను పంపేందుకు మళ్లీ ప్రత్యేక ఫార్మాట్లను క్షేత్రస్థాయికి పంపింది.
ఆ తర్వాత ఎప్పుడు ఏం చేయాలనే టైంటేబుల్ను కూడా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసింది. ఈ టైంటేబుల్ ప్రకారం వివిధ అధికారుల స్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయని, వీటిని ఉన్నతాధికార వర్గాలు పరిశీలించాయని, అనంతరం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆమోదం తెలిపారని, ఇప్పుడు బంతి సీఎం రేవంత్ కోర్టులో ఉందని సమాచారం.
తక్కువ ఉన్న చోట్ల ఎక్కువగా
విశ్వసనీయ సమాచారం ప్రకారం భూముల విలు వలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ విలువలు సవరించే అవకాశాలు కని పిస్తున్నాయి. వ్యవసాయ భూముల ఎకరం కనీస విలువ రూ.4 లక్షలుగా నిర్ధారించాలని, 3 కేట గిరీల్లో ఈ విలువలను సవరించి, హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూములకు రూ.40–50 లక్షల వరకు పెంచాలనే ప్రతిపాదనలు సీఎం వద్దకు చేరి నట్టు సమాచారం.
వ్యవసాయేతర భూములు, ఆస్తుల విషయంలోనూ కొంత మేర దూకుడు పెంచాలని, కనీసం 20 నుంచి 100 శాతం వరకు ఈ విలువలు సవరించాలని నిర్ణయించినట్లు తెలు స్తోంది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రో చర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల ద్వారా కూడా సమాచారం సేకరించారు. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్ల విలు వలను నిర్ధారించనున్నట్టు తెలుస్తోంది.