సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల అయ్యాయి. గతేడాది నవంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1370 ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు జరిగాయి.
గ్రూప్ 3 పరీక్ష మొత్తం 1388 పోస్టుల భర్తీకి నిర్వహించగా 1370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 14,న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది.



