Officers Removed Poor People Huts On Govt Land Near Mahabubabad Collectorate - Sakshi
Sakshi News home page

మహబూబాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత..పేదల గుడిసెలు కూల్చివేత

Jun 13 2023 10:35 AM | Updated on Jun 13 2023 3:02 PM

Officials Remove Poor people Huts Near Mahabubabad Collectorate - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు.  255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు.

ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement