
ఆటోడ్రైవర్పై గొడ్డలితో దాడి
పళ్లిపట్టు: ఆటోడ్రైవర్పై గొడ్డలితో అన్నదమ్ములు దాడి చేశారు. ఈ ఘటన తిరుత్తణిలో చోటుచేసుకుంది. తిరుత్తణి చెరువుకట్ట వీధికి చెందిన మహేష్కుమార్ (34) ఆటోడ్రైవర్. శనివారం ఉదయం ఇంటి వద్ద వుండగా, ఇతని సోదరుడి కూతురు ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో ఇంట్లో ప్రవేశించేందుకు ఎగువ తిరుత్తణికి చెందిన గురు(35) ప్రయత్నించాడు. ఇది చూసిన మహేష్కుమార్ గురును హెచ్చరించి దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన గురు, అతని తమ్ముడు శరణ్(18)తో కలిసి ఎగువ తిరుత్తణిలో ఆటోలో ప్రయాణికులను తీసుకెళుతున్న మహేష్కుమార్ ఆటోను వెంబడించి గొడ్డలితో ఆటోను ధ్వంసం చేసి డ్రైవర్ తలపై గొడ్డలితో నరికి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహేష్కుమార్ను స్థానికులు తిరుత్తణి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు గురు, శరణ్ కోసం గాలిస్తున్నారు.