భువనగిరిటౌన్ : పీఎం సంసద్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు ఆదివారం భువనగిరి పట్టణానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ రానున్నారు. ఇందుకు గాను భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేస్తున్న వేదిక ఏర్పాట్లను శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, నాయకులు పాశం భాస్కర్, పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేంద్గుప్తా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు.


