ఎగిరేది గులాబీ జెండానే.. | - | Sakshi
Sakshi News home page

ఎగిరేది గులాబీ జెండానే..

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

ఎగిరేది గులాబీ జెండానే..

ఎగిరేది గులాబీ జెండానే..

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు కౌన్సిలర్‌ అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అర్థమైందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలెప్పటికీ మరువలేరన్నారు. అందుకే ప్రజలు ఆలోచన చేసి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement