వైభవంగా నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా నిత్యకల్యాణం

Jan 3 2026 8:03 AM | Updated on Jan 3 2026 8:03 AM

వైభవంగా నిత్యకల్యాణం

వైభవంగా నిత్యకల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యహోమం, పంచామృతాబిషేకం జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం తర్వాత నిత్య కల్యాణం నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈఓ నవీన్‌కుమార్‌, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement