
భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును అదనపు కలెక్టర్ రాంబాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏపూరు, దాచారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో బియ్యం, రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాదవ్ రావు, తహసీల్దార్ అమీన్ సింగ్, ఆర్ఐ ప్రదీప్, స్వప్న ఉన్నారు.
రెవెన్యూ సదస్సుల పరిశీలన
మోతె: మోతె మండల పరిధిలోని గోపాలపురం, విభళాపురం గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అదనపు కలెక్టర్ రాంబాబు పాల్గొన్నారు. తహసీల్దార్ వెంకన్న మాట్లాడుతూ.. మోతె మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో 2,077 మంది రైతుల దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ రాంబాబు