గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

May 15 2023 1:34 AM | Updated on May 15 2023 1:34 AM

మోత్కూరు : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ నుంచి మంజూరైన రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు, యువత, విద్యావంతులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. పది వేల పుస్తకాలను సేకరించిన గ్రంథాలయ కమిటీ చైర్మన్‌ కోమటి మత్స్యగిరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్‌ చైర్మన్‌ బొల్లెపల్లి వెంకటయ్య, మార్కెట్‌ చైర్మన్‌ కె.యాకూబ్‌రెడ్డి, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ రచ్చ లక్ష్మినర్సింహ్మారెడ్డి, రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌ కె.అశోక్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సి.శ్రీకాంత్‌, నేవూరి ధర్మేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కళ్యాణ్‌చక్రవర్తి, లెంకల సుజాత, దబ్బెటి విజయ, కారుపోతుల శిరీషశ్రీనివాస్‌, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ గుర్రం లక్ష్మినర్సింహ్మారెడ్డి, రైతు బంధు మండల కోఆర్డినేటర్‌ కె.సోంమల్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్‌ కమిటీ మెంబర్‌ దాసరి తిరుమలేష్‌, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యులు గనగాని నర్సింహ్మ, షాహిన్‌ సుల్తానా, ఆనందమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement