పోలాకి: మండలంలోని మబగాంలో పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాబోయే మార్పు లు, వాతావరణం, రాజకీయ, సామాజిక అంశాలపై శృంగవరపు లక్ష్మీధనుంజయశర్మ పంచాగ పఠనంలో స్పష్టంగా తెలియజేశారని కృష్ణదాస్ అన్నారు. స్వగ్రామంలో తోటి రైతులు, గ్రామస్తులతో కలిసి పంచాంగ శ్రవణంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అభిమానులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.


