సిక్కోలులో సినీ నటి రెజీనా కసాండ్రా సందడి చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డులో పాండురంగవీధిలో ‘కలర్స్ హెల్త్ కేర్’ ప్రారంభానికి విచ్చేసిన ఈమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా తలపెట్టిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ ప్లకార్డులను ప్రదర్శించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలను వీడాలని యువతకు సందేశమిచ్చారు.
– శ్రీకాకుళం క్రైమ్


