స్మార్ట్ మీటర్లతో ఆందోళన
కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లు అమర్చుతోంది. దీనికి తోడు సూర్యఘర్ పథకం కింద సోలార్ పథకానికి రూపకల్పన చేసింది. దీంతో విద్యుత్ మీటర్లు గణనీయంగా తగ్గముఖం పట్టనున్నాయి. స్మార్ట్ మీటర్తో నేరుగా వినియోగదారుడే ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ జరుపుతాడు. సూర్యఘర్తోనూ అదే పరిస్థితి. అందుకే మీటర్ రీడింగ్ తీసేవారు ఆందోళనలో ఉన్నారు. తమ సమస్యలను పరిష్కరించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టారు.


