పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు

Nov 27 2025 6:00 AM | Updated on Nov 27 2025 6:00 AM

పచ్చన

పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు

గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం పలాస: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎకనమిక్స్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీ భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.వెంకటలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపా రు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ 55శాతానికి పైగా మార్కులతో పూర్తి చేసి ఉండాలని, పీహెచ్‌డీ వంటి అదనపు అర్హతలు కలిగి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నవంబరు 29న డెమో, ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.

వజ్రపుకొత్తూరు రూరల్‌: పచ్చని ఉద్దానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి జీవనోపాధి సాగిస్తున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు కార్గో చిచ్చు పెట్టి తమ జీవితాలను రోడ్డుపాలు చేయవద్దని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్గో ఎయిర్‌ పోర్టు వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 21 నుంచి సాగుతున్న నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా చీపురపల్లి పంచాయతీ సంతోష్‌నగర్‌లో కార్గో ఎయిర్‌ పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 21న మహాధర్నా పేరున రైతులతో కలిసి పలాస ఆర్డీఓకి తమ గోడు వినిపించాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. పాలకులు ఇదే పంథా కొనసాగిస్తే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు, బాధితులు పాల్గొన్నారు.

సాగునీటి కాలువలో పడి వ్యక్తి మృతి

శ్రీకాకుళం రూరల్‌: పెదపాడు పంచాయతీ ముద్దాడపేటకు చెందిన ముద్దాడ తారకేశ్వరరావు (40) బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు సాగునీటి కాలువలో పడి మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు   1
1/1

పచ్చని ఉద్దానంలో కార్గో చిచ్చు పెట్టొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement