
● కదంబ పుష్పార్చన
జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డులో విజయగణపతి ఆలయం వద్ద స్వామివారికి సోమవారం కదంబ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. – శ్రీకాకుళం కల్చరల్
● డాబాపై
డ్రాగన్ ఫ్రూట్
జిల్లా కేంద్రంలోని దండివీధిలో నివాసముంటున్న ప్రసాద్ తన డాబాపై డ్రాగన్ ఫ్రూట్ పండించారు. కొన్నాళ్లుగా మొక్కను శ్రద్ధగా పెంచడం వల్ల ఎట్టకేలకు ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.
– శ్రీకాకుళం కల్చరల్
● పులి కాదు పునుగు పిల్లి
టెక్కలి మండలం జయకృష్ణాపురం గ్రామ సమీప పొలాల్లో సోమవారం వింత జంతువు సంచరించింది. చిరుత పులి పిల్లను పోలి ఉండటంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై అటవీ శాఖాధికారులు స్పందిస్తూ చిరుత పులిని పోలి ఉండే ఈ జంతువును నీటి పిల్లి, పునుగు పిలి, ఫిస్సింగ్ క్యాట్గా పిలుస్తాంటారని చెప్పారు. దీని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, చేపల వేట కోసం చెరువులు వద్దకు వస్తుంటాయని తెలిపారు. ఇలాంటి జీవులకు ఎటువంటి హాని కలిగించవద్దని కోరారు. – టెక్కలి రూరల్
● ఒకే ఒక్కడు!
కూటమి సర్కారు తీసుకున్న చర్యలతో సచివాలయాలు నిర్వీరమైపోయాయి. ఇచ్ఛాపురం మండలం ఈదుపురం–2 గ్రామ సచివాలయంలో ప్రస్తుతం వెల్ఫేర్ అసిస్టెంట్ పులకల ఉమాపతి ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. తల్లికి వందనం సమస్యలు, భూ శిస్తులు, ఆధార్ సీడింగ్, కుల, నివాస ధ్రువ పత్రాల కోసం సోమవారం పదుల సంఖ్యలో లబ్ధిదారులు చేరుకోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయం చేసేందుకు మరో ఉద్యోగి లేక సాయంత్రం వరకు ఆకలితో అలమటిస్తూ విధులు నిర్వహించారు. ఇక్కడ మరో ఇద్దరు సిబ్బంది ఉండేవారు. వారిలో ఒకరు డీఎస్సీ పరీక్ష కోసం సెలవు పెట్టగా, మరొకరు బూర్జ పాడులో ఇన్చార్జి విధులు నిర్వర్తిస్తున్నారు.
–ఇచ్ఛాపురం రూరల్

● కదంబ పుష్పార్చన

● కదంబ పుష్పార్చన

● కదంబ పుష్పార్చన