వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఒక కుటుంబం.. రూ.7.91 లక్షల ప్రయోజనం | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఒక కుటుంబం.. రూ.7.91 లక్షల ప్రయోజనం

Aug 6 2023 1:38 AM | Updated on Aug 6 2023 12:02 PM

- - Sakshi

నరసన్నపేట:  చిత్రంలో ఉన్నది పట్నాన శంకరరావు, లక్ష్మి కుటుంబం. నరసన్నపేట మేజర్‌ పంచాయతీ కలివరపుపేట వీధిలో నివాసముంటున్నారు. వీరికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏకంగా రూ.7.91 లక్షల ప్రయోజనం కలిగింది.

శంకరరావుకు వాహనమిత్ర, భార్య లక్ష్మికి వైఎస్సార్‌ ఆసరా, తల్లి అన్నపూర్ణకు పింఛన్‌, కుమారుడు కమలకుమార్‌కు జగనన్న విద్యాదీవెన, కుమార్తె చంద్రికకు జగనన్న వసతి దీవెన పథకాలు వర్తించాయి.

ఇంటి స్థలం, నిర్మాణానికి నిధులు సైతం మంజూరయ్యాయి. ఇచ్ఛాపురం నుంచి నరసన్నపేటకు వలస వచ్చామని, ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు సొంత ఇల్లు నిర్మించుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement