ప్రజాస్వామ్యానికి పాతర | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి పాతర

Dec 12 2025 6:05 AM | Updated on Dec 12 2025 6:05 AM

ప్రజా

ప్రజాస్వామ్యానికి పాతర

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: ఇది రామగిరి..ఇక్కడ మేం ఏమైనా చేయగలం..మేం చెప్పిందే వేదం..మేం చేసిందే చట్టం అన్న రీతిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. బలంలేకున్నా బరితెగించి రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో నిలిచారు. ప్రజాస్వామ్యానికి పాతర వేసి వైఎస్సార్‌ సీపీకి చెందిన కుంటిమద్ది ఎంపీటీసీ సభ్యురాలు సాయిలీలను ప్రలోభాలకు గురి చేశారు. గురువారం జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో సాయిలీలకు టీడీపీ కండువా కప్పి దౌర్జన్యంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎంపీపీగా ఏకగ్రీవం చేశారు.

రామగిరి మండలంలో పది ఎంపీటీసీ స్థానాలుండగా... అందులో పేరూరు–1, పేరూరు–2, మాదాపురం, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, రామగిరి, కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రిలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వు కాగా, రామగిరి ఎంపీటీసీ సభ్యురాలు మీనుగ నాగమ్మ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే 2024 డిసెంబరులో ఆమె అనారోగ్యంతో మృతి చెందగా... ఎంపీపీ స్థానం దక్కించుకునేందుకు పరిటాల కుటుంబం కుట్రలు, కుతంత్రాలకు తెరతీసింది. తమ పార్టీ తరఫున మహిళా ఎంపీటీసీలు లేకపోవడంతో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు.

టీడీపీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌ ఘటనలతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నాలుగుసార్లు వాయిదా పడింది.

● ఈ ఏడాది మార్చి 27న ఎంపీపీ ఎన్నికకు అధికారులు తొలిసారి నోటిఫికేషన్‌ ఇవ్వగా... సొంత మండలం రామగిరి పీఠం దక్కించుకోవాలని పరిటాల కుటుంబం కుట్రలు పన్నింది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1 ఎంపీటీసీ సభ్యుడు కర్రెన్న, మాదాపురం ఎంపీటీసీ సభ్యుడు సంపత్‌కుమార్‌లకు పచ్చ కండువాలు కప్పి తమవైపునకు లాక్కుంది. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు మార్చి 27న నిర్వహించిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను బహిష్కరించారు. దీంతో కోరం లేక అధికారులు ఎన్నిక వాయిదా వేశారు.

● మే 18న రెండోసారి ఎంపీపీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. అనెక్జర్‌ లెటర్‌ ఇవ్వడానికి 17వ తేదీ రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నాయకులు పేరూరు నాగిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, బోయ రామాంజనేయులపై టీడీపీ నేతలు దాడి చేయడమేకాక వారి వాహనాలను ధ్వంసం చేసి భయాందోళనకు గురిచేశారు. అంతేకాకుండా 18వ తేదీన రామగిరి ఎన్నికలో పాల్గొనేందుకు వస్తున్న పేరూరు–2 ఎంపీటీసీ భారతిని పెనుకొండలో సినిమాతరహాలో కిడ్నాప్‌కు యత్నించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఆరోజు వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నికను బహిష్కరించగా రెండోసారి వాయిదా పడింది.

● జూలై 16వ తేదీన మూడోసారి, ఆగస్ట్‌ 13వ తేదీన నాల్గోసారి రామగిరి ఎంపీపీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. రామగిరిలో తమకు భద్రతలేదని భావించిన వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలు ఆ రెండు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో మరోసారి అధికారులు ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇవ్వగా టీడీపీ నేతలు అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ కొలువుదీరినప్పటి నుంచి రామగిరి మండలంలోని వైఎస్సార్‌ సీపీ నేతలను టీడీపీ నేతలు టార్గెట్‌ చేశారు. ఇళ్లు, వాహనాలు, పొలాల్లోని పచ్చని చెట్లను లక్ష్యంగా చేసుకొని రోజూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 30వ తేదీన వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యపై పరిటాల సమీప బంధువులు దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అప్పటి నుంచి మరింత పేట్రేగి పోయిన టీడీపీ నేతలు తమకు అడ్డుగా వస్తే అంతం చేస్తామంటూ గ్రామాల్లో మితిమీరి ప్రవర్తించారు. చివరకు వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎంపీటీసీ కప్పల సాయిలీలను భయపెట్టి పార్టీలో చేర్చుకున్నారు. గురువారం జరిగిన ఎన్నికలో ఆమెను అప్రజాస్వామికంగా ఎన్నిక చేసుకుని సంబరపడుతున్నారు.

రామగిరి ఎంపీపీ ఎన్నికలో

‘పరిటాల’ నిసిగ్గు రాజకీయం

వైఎస్సార్‌ ఎంపీటీసీలకు ప్రలోభాలు, బెదిరింపులు

కుంటిమద్ది ఎంపీటీసీ

కప్పల సాయిలీలకు బలవంతంగా పచ్చకండువా

కోరం లేకపోయినా

నలుగురితో ఎన్నిక పూర్తి

ఎంపీపీగా గెలిచామంటూ సంబరాలు

టీడీపీ దుర్మార్గాలకు నిరసనగా

ఎంపీపీ ఎన్నికకు వైఎస్సార్‌ సీపీ దూరం

అధికారం కోసం పరిటాల కుటుంబం ఎంతకై నా దిగజారుతుందని రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో మరోసారి

రుజువైంది. బలం లేకపోయినా ఎంపీపీ ఉప ఎన్నిక బరిలో నిలిచిన టీడీపీ నేతలు...వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేశారు. చివరకు వైఎస్సార్‌ సీపీకి చెందిన కుంటిమద్ది

ఎంపీటీసీ సాయిలీలకు పచ్చకండువా వేసి ఎంపీపీగా నిలబెట్టారు. టీడీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీలు ఉప ఎన్నికను బాయ్‌కాట్‌ చేయగా.. నలుగురు ఎంపీటీసీలతోనే ఉప ఎన్నిక ముగించారు.

దాడులు... దౌర్జన్యాలే లక్ష్యం..

బలం లేకున్నా... బరిలో నిలిచి..

నాలుగుమార్లు వాయిదా..

ప్రజాస్వామ్యానికి పాతర 1
1/2

ప్రజాస్వామ్యానికి పాతర

ప్రజాస్వామ్యానికి పాతర 2
2/2

ప్రజాస్వామ్యానికి పాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement