పాస్‌పోర్టు సేవలను వేగవంతంగా అందించాలి | - | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టు సేవలను వేగవంతంగా అందించాలి

Jul 24 2026 1:27 AM | Updated on Jul 24 2026 1:27 AM

నెల్లూరు రూరల్‌: పాస్‌పోర్టు సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాధికారి నందుల భూక్య సూచించారు. నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో గల పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని నెల్లూరు పోస్టల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సేవా కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ, పత్రాల ధ్రువీకరణ, బయోమెట్రిక్‌ నమోదు, అపాయింట్‌మెంట్‌ నిర్వహణ తదితరాలను పరిశీలించి.. ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నందుల భూక్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాస్‌పోర్టు సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడం అధికారుల బాధ్యతని చెప్పారు. దరఖాస్తుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సమయపాలనతో సేవలందేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement