చెరువులో మట్టిని తవ్వేశారిలా..
● ఐదు టిప్పర్లు, ఒక హిటాచీ స్వాధీనం
మర్రిపాడు: మండలంలోని పెద్దమాచనూరు చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై ఆకస్మిక దాడులను ఉదయగిరి పోలీసులు ఆదివారం నిర్వహించారు. అనుమతుల్లేకుండా మట్టిని తరలిస్తున్న ఐదు టిప్పర్లు, తవ్వకాలకు వినియోగిస్తున్న ఒక హిటాచీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై పోలీస్స్టేషన్కు తరలించారు. తవ్వకాలపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.


