● ఎమ్మెల్సీని కోరిన
ఆర్టీసీ యూనియన్ నాయకులు
నెల్లూరు(పొగతోట): ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రభుత్వమే నేరుగా నడపాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. ఆ మేరకు గురువారం నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల సేవలను ప్రైవేట్కు అప్పగించడం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితి ఆర్టీసీ మనుగడకే ప్రమాదకరమన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలను చట్టసభల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఆర్టీసీ భవితవ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బాబుశామ్యూల్, కృష్ణారావు, మురళీమోహన్రెడ్డి, కట్టా సుబ్రహ్మణ్యం, నారాయణరావు, మాల్యాద్రి పాల్గొన్నారు.


