1297 హెక్టార్లలో పంట నష్టం | - | Sakshi
Sakshi News home page

1297 హెక్టార్లలో పంట నష్టం

Mar 21 2026 4:53 AM | Updated on Mar 21 2026 4:53 AM

నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నాలుగు మండలాలు ప్రభావితమై.. 1297 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయ ఏడీఏ నర్సోజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

● అనంతసాగరం మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 1071 మంది రైతులకు సంబంధించిన 914 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి.. 140 హెక్టార్లలో పూత దశలో ఉన్న పత్తి పంట దెబ్బతినిందని చెప్పారు.

● రాపూరు మండలంలోని ఓ గ్రామంలో 80 మంది రైతులకు సంబంధించిన 80 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

● కలువాయి మండలంలోని నాలుగు గ్రామాల్లో 26 మంది రైతులకు చెందిన 13 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతినిందని తెలిపారు.

● మర్రిపాడు మండలంలోని ఐదు గ్రామాల్లో 250 మంది రైతులకు సంబంధించిన 150 హెక్టార్లలో కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు నివేదికలను సిద్ధం చేశామని వివరించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలకు జిల్లాలోని ఏ ప్రాంత రైతులకు నష్టం జరిగినా, అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.

రాపూరు: మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయాధికారి సోమసుందర్‌ పరిశీలించారు. గాలీవాన, వడగండ్లతో గోనుపల్లిలోని వరి, మామిడి, నిమ్మ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేలా నివేదికను సమర్పించనున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement