ఉధృతంగా వాగులు
● జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటాచలం చెరువు నిండిపోయి నీరు జాతీయ రహదారిపైకి చేరింది. మండలంలో జెర్రిపోతు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
● మనుబోలు మండలం పిడూరు, బద్దెవోలు, కొలనకుదురు గ్రామాల్లోకి వాన నీరు చేరింది.
● పొదలకూరు మండలం ముడిగేడు – ఇనుకుర్తి మధ్య వాగు పొంగి రాకపోకలు స్తంభించాయి.
● చేజర్లలోని నల్లవాగు, నాపూరు పెద్ద వాగు ఉధృతంగా ప్రవిహిస్తున్నాయి.
● సైదాపురం మండలంలో పాలూరు – వేములచేడు మధ్య కుంటి కాలువ పొంగింది. కై వల్య నది ఉధృత రూపం దాల్చింది. బొగ్గేరు, బీరాపేరు, పైడేరు, మలిదేవి డ్రెయిన్లు ప్రవహిస్తున్నాయి.
● ఆత్మకూరు మండలంలోని వెన్నవాడ సమీపంలో ఉత్తర కాలువకు భారీ గండిపడింది. పొలాల్లోని నీరు కాలువ వద్దకు చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
● అనంతసాగరం సమీపంలోని ఓ కాలువకు వరద పెరగడంతో దళితవాడకు రాకపోకలు నిలిచిపోయాయి.
● రాపూరు మండలంలోని గోనుపల్లి బాడవ వాగు పొంగి ప్రవహిస్తోంది.


