చరిత్ర సృష్టించిన స్మృతి మంధన | Women's CWC 2025, IND VS SA Final: Smriti Mandhana Becomes Top Run Scorer In SINGLE WORLD CUP EDITION FOR INDIA | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన స్మృతి మంధన

Nov 2 2025 6:12 PM | Updated on Nov 2 2025 6:12 PM

Women's CWC 2025, IND VS SA Final: Smriti Mandhana Becomes Top Run Scorer In SINGLE WORLD CUP EDITION FOR INDIA

టీమిండియా స్టార్‌ మహిళా బ్యాటర్‌ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్‌ వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. 

2025 వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో (Women's CWC 2025) భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్‌ 2) జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధన ఈ ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్‌ పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. తాజా ఎడిషన్‌లో మంధన 412 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. సౌతాఫ్రి​కా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా, భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు స్మృతి మంధన (39), షఫాలీ వర్మ (48) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 17 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 97/0గా ఉంది.

తుది జట్లు..
భారత్‌: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్‌), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్(కెప్టెన్‌), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(వికెట్ కీపర్‌), అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా,  మ్లాబా

చదవండి: IND Vs AUS: సుందర్‌ విధ్వంసం.. ఆసీస్‌పై టీమిండియా గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement