ఫిడే ప్రపంచ కప్‌లో పాల్గోనున్న రాజా రిత్విక్ | Telngana GM Raja Rithvik is set to participate in Chess World Cup 2025 | Sakshi
Sakshi News home page

ఫిడే ప్రపంచ కప్‌లో పాల్గోనున్న రాజా రిత్విక్

Oct 31 2025 9:40 PM | Updated on Oct 31 2025 9:40 PM

Telngana GM Raja Rithvik is set to participate in Chess World Cup 2025

గోవా వేదికగా జరగనున్న ఫిడే ప్రపంచ కప్ 2025లో తెలంగాణకు చెందిన గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ పాల్గోనున్నాడు. రిత్విక్ మొదటి రౌండ్‌లో కజకిస్థాన్‌కు చెందిన నోగర్‌బెక్ కాజిబెక్‌తో తలపడనున్నాడు. . ఈ ఇద్దరు ఆటగాళ్లు నవంబర్ 1, 2 తేదీలలో రెండు క్లాసికల్ గేమ్‌లు ఆడతారు. ఒకవేళ రెండు రౌండ్ల తర్వాత పాయింట్లు సమానమైతే ఈ ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు నవంబర్ 3న రాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో టై-బ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు.

ఇక ప్రపంచ కప్‌లో పాల్గొనడం పట్ల రాజా రిత్విక్ సంతోషం వ్యక్తం చేశాడు. వరల్డ్‌లోనే అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడనుండడం తన స్కిల్స్‌కు నిజమైన పరీక్ష అని రిత్విక్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో 80 దేశాల నుంచి మొత్తం 208 మంది చెస్ ఆటగాళ్లు  భాగం కానున్నారు. అయితే భారత్ నుంచి మొత్తం 24 మంది ప్లేయర్లు త​మ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement