టాప్‌ సీడ్‌ జోడీపై సానియా జంట సంచలన విజయం

Sania Mirza-Lucie Hradecka Enters Doubles Semi Final Beating World No 1 - Sakshi

ఖతర్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో సానియా మీర్జా (భారత్‌)–లూసీ హర్డెస్కా (చెక్‌ రిపబ్లిక్‌) జంట సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 7–6 (7/5), 4–3తో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్, టాప్‌ సీడ్‌ జోడీ సినియకోవా–క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్‌ను సొంతం చేసుకొని రెండో సెట్‌లో సానియా–హర్డెస్కా 4–3తో ఆధిక్యంలో ఉన్న దశలో సినియకోవా–క్రిచికోవా గాయంతో వైదొలిగారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top